Tuesday, July 23, 2024

AP: నంద్యాల ఎస్పీపై ఈసీ సీరియ‌స్.. చ‌ర్య‌ల‌కు ఆదేశం..

ఎన్నికల కోడ్ అమల్లో విఫలమైనందుకు నంద్యాల ఎస్పీ రఘువీరారెడ్డిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం డీజీపీని ఆదేశించింది. ఆయనపై ఛార్జెస్ ఫైల్ చేయాలని సూచించింది. ఎస్పీ తోపాటు మ‌రో ఇద్ద‌రు పోలీసు అధికారులైన రవీంద్రనాథ్ రెడ్డి, రాజారెడ్డిపై చర్యలు తీసుకోవాలని పేర్కొంది.

నిన్న ఎన్నికల ప్రచారానికి చివరి తేదీ కావడంతో తనకు స్నేహితుడైన వైసీపీ నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి బాలీవుడ్ నటుడు, స్టార్ హీరో అల్లు అర్జున్ తన భార్య స్నేహరెడ్డితో కలిసి వెళ్లారు. అల్లు అర్జున్ దంపతులు వచ్చిన సమయంలో భారీగా ప్రజలు, ఫ్యాన్స్ అల్లు అర్జున్ ని చూసేందుకు తరలివచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లా వైరల్ అయినాయి. అయితే తమ అనుమతి లేకుండా జన సమీకరణ చేశారంటూ ఆ నియోజకవర్గానికి చెందిన రిటర్నింగ్ ఆఫీసర్ అల్లు అర్జున్ సహా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డి మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఐపీసీ సెక్షన్ 188 కింద ఈ కేసు నమోదు చేయగా క్రైమ్ నెంబర్ 71/2024గా కేసు రిజిస్టర్ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement