Thursday, May 16, 2024

MDK: జిన్నారం ఎంపీపీకి అవిశ్వాస సెగ

పటాన్​చెరు(ప్రభ న్యూస్): జిన్నారం ఎంపీపీ రవీందర్ గౌడ్ పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని కోరుతూ మెజారిటీ ఎంపీటీసీ సభ్యులు శుక్రవారం సంగారెడ్డి ఆర్డిఓ రవీందర్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. మండలంలో మొత్తం 8 మంది ఎంపీటీసీలు ఉండగా వీరిలో ఐదు మంది ఎంపీపీ పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని కోరారు.

ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ గంగు రమేష్, ఎంపీటీసీలు వెంకటేష్ గౌడ్, భార్గవ్ మాట్లాడుతూ మండల పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఎంపీపీ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలకు తమకు సమాచారం ఇవ్వకుండా నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పాలనలో ఎంపీటీసీలను దూరం పెడుతూ అవమానిస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు వెంకటేశం గౌడ్, భార్గవ్, సంతోష మహేష్, స్వాతి ప్రభాకర్ రెడ్డిలు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement