Saturday, April 27, 2024

చలివేంద్రాన్ని ప్రారంభించిన ముదిరాజ్‌ సంఘం అధ్యక్షులు..

జిన్నారం : మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను జిన్నారం మండల కేంద్రంలో అదేవిధంగా ఊట్ల గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిన్నారం వైస్‌ ఎంపీపీ గంగూర్‌ రమేష్‌ యువకులు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వైస్‌ ఎంపీపీ రమేష్‌ మాట్లాడుతూ భారతదేశంలో కుల వ్యవస్థను నిర్మూలించడం కోసం పోరాటం చేసిన భరతమాత ముద్దుబిడ్డ మహాత్మ జ్యోతిరాజు పూలే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల ముదిరాజ్‌ సంఘం ఉపాధ్యక్షుడు శ్రీధర్‌, నీలం మధుముదిరాజ్‌, యువసేన నాయకులు, శేఖర్‌, మత్య్సశాఖ అధ్యక్షులు సత్యనారాయణ, ముదిరాజ్‌ నాయకులు రాజు, పుట్టి భాస్కర్‌, సుంకరబోయిన మహేష్‌, రాజు, మున్నీ శ్రీనివాస్‌, శ్రీధర్‌ బిక్షప తి సాయికుమార్‌, నాగరాజు, రమేష్‌, చిరంజీవి, రాము, నర్సింలు, వెంకటేష్‌, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement