Wednesday, May 15, 2024

అన్ని దానాల కంటే రక్తదానం గొప్పది : ఎమ్మెల్యే గూడెం మ‌హిపాల్ రెడ్డి

ప‌టాన్ చెరు : అన్ని దానాల కంటే రక్తదానం గొప్పదని, ఆపత్కాలంలో మనిషికి రక్తం సంజీవిని లాంటిదని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. స్వతంత్ర్య భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా చేపడుతున్న ద్వి సప్తహ కార్యక్రమాల్లో భాగంగా బుధవారం ప‌టాన్ చెరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్తదాతలను అభినందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వజ్రోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలలో రక్తదాన శిబిరం మహోన్నతమైనదని అన్నారు. ఒకరి నుండి సేకరించిన రక్తం ముగ్గురికి వివిధ రూపాలలో ఉపయోగపడుతుందని తెలిపారు. ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగాల మూలంగా నేడు మనం స్వేచ్ఛ ఊపిరులు పీల్చుకుంటున్నామని, వారి త్యాగాలను నేటి తరానికి తెలియజెప్పడం సంతోషకరంగా ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement