Monday, April 29, 2024

ఎన్టీఆర్‌ సంచార ఆరోగ్య రథం ద్వారా… అత్యాధునిక పరిజ్ఞానంతో వైద్య సేవలు : ఎమ్మెల్యే బాల‌కృష్ణ‌

శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మండలం చలివెందులలో ఎమ్మెల్యే బాలకృష్ణ దంపతులు పర్యటించారు. సంచార వైద్యసేవల కోసం ఎన్టీఆర్‌ ఆరోగ్య రథం అనే ప్రత్యేక బస్సును వారు ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఆస్పత్రిలో 30 వెంటిలేటర్లు వినియోగించకుండా అక్కడి సిబ్బంది మూలన పడేయడం దురదృష్టకరమని అన్నారు. ఆస్పత్రికి ఇచ్చిన అనేక పరికరాలు ఉపయోగించని దుస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. రెండేళ్ల పాటు కరోనాతో ఇబ్బంది పడ్డ ప్రజలకు టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సేవలందించారని ప్రశంసిం చారు. తాము ప్రారంభిం చిన సంచార రథం ద్వారా అత్యాధునిక పరిజ్ఞానంతో వైద్య సేవలు నియోజకవర్గ ప్రజలకు అందిస్తామని వివరించారు. ప్రత్యేక వైద్య బృందం ద్వారా వైద్య పరీక్షలు , ఉచిత వైద్యం అందిస్తామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement