Wednesday, May 15, 2024

NZB: రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య..

నిజామాబాద్, ఏప్రిల్ 29(ప్రభ న్యూస్) : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది.. రైల్వే ఎస్సై కథనం ప్రకారం.. ఆదివారం రాత్రి రైల్వే స్టేషన్ లో అజంతా ఎక్స్ ప్రెస్ స్టేషన్ వద్దకు రాగానే ఫ్లాట్ ఫాం పై ఉన్న యువకుడు హఠాత్తుగా రైలుకు అడ్డంగా వెళ్లి ఆత్మహత్యకు పాల్పడగా మృతి చెందినట్లు రైల్వే ఎస్సై సాయి రెడ్డి తెలిపారు.

యువకుడి వివరాలు తెలియలేద‌న్నారు. యువకుడు వైలెట్ కలర్ షర్ట్, బ్లూ జీన్ పాయింట్ ధరించి ఉన్నాడని తెలిపారు. ఈ వ్యక్తిని ఎవరైనా గుర్తుపట్టినట్లయితే సంప్రదించాలని రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement