Monday, July 22, 2024

Tadipatri – జెసి ప్ర‌భాక‌ర‌రెడ్డికి అస్వ‌స్థ‌త – కిమ్స్ లో చికిత్స‌

తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రిలో మంగళవారం జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. దాని ప్రభావంతో మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌ కారణంగా జేసీ ప్రభాకర్‌రెడ్డి సికింద్రాబాద్‌ కిమ్స్‌లో చికిత్స పొందుతున్నారని ఆయన కుమారుడు జేసీ అస్మిత్‌రెడ్డి తెలిపారు. ఆయన్ను చూసేందుకు కార్యకర్తలు రావొద్దని విజ్ఞప్తి చేశారు. వైద్య నిర్ధరణ పరీక్షలు పూర్తయిన తర్వాత బులెటిన్‌ విడుదల చేస్తామని వైద్యులు ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement