Friday, April 26, 2024

మేడిపల్లి అడవుల్లో వ్యక్తి మృతి.. రోడ్డు ప్రమాదమా, హత్యనా?

కాటారం రూరల్, (ప్రభ న్యూస్): జయశంకర్ జిల్లా భూపాలపల్లి -కాటారం జాతీయ రహదారి ద‌గ్గ‌ర‌ మేడిపల్లి అడవిలో ఒకరు మృతి చెందిన ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాటారం మండలం గుమ్మలపల్లి గ్రామానికి చెందిన కంకణాల బాపురెడ్డి (60) అలియాస్ గర్ని బాపు మేడిపెళ్లి అడవుల్లో చ‌నిపోయిన‌ట్టు బంధువుల ద్వారా తెలిసింది. శుక్రవారం ఉదయం బాపురెడ్డి భూపాలపల్లి మండలం గుర్రంపేట గ్రామంలో బంధువు మృతిచెందగా వెళ్లినట్లు కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది.

తన ద్విచక్రవాహనంపై తిరుగు ప్రయాణమై గుమ్మలపల్లి వస్తున్న క్రమంలో మేడిపల్లి సమీపంలోని రోడ్డు కందకంలో చనిపోయి ఉన్నట్లు, బైక్ పూర్తిగా ధ్వంసం అయినట్లు సంఘటనా స్థలాన్ని సందర్శించిన కాటారం ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. సంఘటనా స్థలాన్ని సందర్శించిన కొందరు వ్యక్తులు బాబు రెడ్డిది హత్యనా, లేక రోడ్డు ప్రమాదమా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిగురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement