Saturday, April 27, 2024

తిరుమల తిరుపతి దేవస్థానానికి కోటి రూపాయల విరాళం

తిరుమల, ప్రభన్యూస్‌ : దుబాయ్‌లో నివాసముంటున్న చార్టెడ్‌ అకౌంటెంట్‌ హనుమంతకుమార్‌ శుక్రవారం తిరుమల తిరుపతి దేవస్థానానికి కోటి రూపాయలు విరాళం అందించారు. తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో టీటీడీ చైర్మన్‌ వైవీ.సుబ్బారెడ్డిని కలిసి ఈ మేరకు డీడీని అందచేశారు. ఈ సొమ్మును ఏ ట్రస్టుకైనా జమ చేసుకోవచ్చని దాత కోరారు. అలాగే టీటీడీ గో సంరక్షణ ట్రస్టుకు సికింద్రాబాద్‌కు చెందిన పద్మావతి సొల్యూషన్స్‌ అధినేత శ్రీధర్‌ శుక్రవారం రూ.10,01,116ను విరాళంగా అందించారు. తిరుమలలోని టీటీడీ చైర్మన్‌ క్యాంపు కార్యాలయంలో డీడీని టీటీడీ చైర్మన్‌ వైవీ.సుబ్బారెడ్డికి అందజేశారు. గో సంరక్షణకు ఈ విరాళం అందించినట్లు దాత తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement