Friday, April 26, 2024

ట్రాక్టర్ అదుపు తప్పి వ్యక్తి మృతి

రంగారెడ్డి జిల్లా యాచారం మండల పరిధిలోని మొగుళ్ళ వంపు, నంది వనపర్తి గ్రామాల మధ్యలో ట్రాక్టర్ అదుపు తప్పి డ్రైవర్ మృతి చెందిన సంఘటన బుధవారం రోజు చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇబరహీంపట్నం మండల పరిధిలోని తుర్కగూడ గ్రామానికి చెందిన జంగయ్య (49) యాచారం నుండి ట్రాక్టర్ లో 6 పెద్ద విద్యుత్ స్థంబాలు తీసుకొని ఓవర్ లోడ్ తో వెళుతున్నాడు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ట్రాక్టర్ అదుపు తప్పి రోడ్డుపక్కన ఉన్న గుంతలోకి వెళ్ళింది దీంతో స్థంబాల మధ్యలో ఇరుక్కుపోయి డ్రైవర్ మృతి చెందినాడు. క్రేన్ సహాయంతో పోలీసులు శవాన్ని బయటికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఇబరహీంపట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement