Tuesday, May 14, 2024

గుండెపోటుతో టిఆర్‌ఎస్‌ కార్యకర్త మృతి..

దేవరకద్ర : గుండెపోటుతో టిఆర్‌ఎస్‌ కార్యకర్త మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని వెంకటాయపల్లి గ్రామంలో జరిగిందని గ్రామస్తులు తెలిపారు. వెంకటాయపల్లి గ్రామానికి చెందిన టిఆర్‌ఎస్‌ కార్యకర్త వెంకటేశ్వర రెడ్డి ఇంట్లో నిద్రిస్తుండగా తెల్లవారుజామున ఆకస్మాత్తుగా ఛాతిలో నొప్పి రావడం వల్ల అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి పట్ల సర్పంచ్‌ ఆంజనేయులు , మాజి సర్పంచ్‌ రంగయ్య గౌడ్‌ , టిఆర్‌ఎస్‌ నాయకులు సంతాపం తెలిపారు. వెంకటేశ్వర్‌ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు జరిగిందని వారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement