Tuesday, July 23, 2024

Tension – ప‌ల్నాడులో వైసిపి, టిడిపి దాడులు…గాలిలోకి పోలీసుల కాల్పులు

పల్నాడు జిల్లాలో మరోసారి ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. గురజాల నియోజకవర్గం మాచవరం మండలం కొత్త గణేశుని పాడులో వైసీపీ, టీడీపీ వర్గాలకు మధ్య చెలరేగిన వివాదం రాత్రి నుంచి కొనసాగుతూనే ఉంది. నిన్న పోలింగ్ పూర్తయిన తర్వాత టీడీపీ కార్యకర్తలు దాడి చేయడంతో, వైసీపీ శ్రేణులు గ్రామం నుంచి బయటికి వెళ్లిపోయి నరసరావుపేట చేరుకుని జ‌రిగిన దాడి గురించి వైసిపి నేత‌లు కాసు మహేష్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్‌లకు చెప్పారు.. దీంతో వారు పెద్ద సంఖ్య‌లో కార్య‌క‌ర్త‌ల‌తో నేడు కొత్త గణేశుని పాడు తీసుకొని వెళ్లారు.

అయితే అక్కడ కూడా వైసీపీ శ్రేణులకు ఎదురుదెబ్బ తగిలింది. గ్రామంలోకి ఎందుకు వచ్చారు అంటూ కొంతమంది, రాళ్లు కర్రలతో వెంబడించడంతో వైసీపీ శ్రేణులు చెల్లా చెదురయ్యారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని, అనిల్ కుమార్ యాదవ్‌ను , కాసు మహేష్ రెడ్డిని ఆ గ్రామం నుంచి పక్కకు తీసుకువెళ్లిపోయారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. దీంతో రంగంలోకి దిగిన కేంద్ర బలగాలు.. అదుపుతప్పిన పరిస్థితిని అదుపు చేసేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు. పరిస్థితి అదుపులోకి వచ్చేవరకు పల్నాడులో ఆంక్షలు విధించారు.. గ్రామాల‌లోకి కొత్త వారిని ఎవ‌రూ రాకుండా చెక్ పోస్ట్ ల‌ను ఏర్పాటు చేశారు..

- Advertisement -

నిన్న‌టి నుంచి హైటెన్ష‌న్

ఏపీలో ఎన్నికల పోలింగ్ సోమవారం ముగిసింది. సాయంత్రం వరగ్గా ప్రశాంతంగా జరిగిన పోలింగ్‌.. 5 గంటల తర్వాత పల్నాడు జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రెండు గ్రూపులుగా విడిపోయిన టీడీపీ, వైసీపీ శ్రేణులు నాటుబాంబులు, పెట్రోల్‌ బాంబులతో దాడులు చేసుకున్నారు. సోమవారం అర్ధరాత్రి వరకు ఈ ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకోగా.. పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు అనిపించినా.. కాసేపటికే మళ్లీ అల్లర్లు మొదలయ్యాయి. రాత్రి శాంతించినా మ‌ళ్లీ తెల్ల‌వారుఝాము నుంచి ప్రారంభ‌మ‌య్యాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement