Monday, April 29, 2024

భక్తులతో కిక్కిరిసిన ఆలయం..

దేవరకద్ర : తెలంగాణ రాష్ట్రంలో పేదల తిరుపతిగా పేరొందిన మన్యంకొండ దేవస్థానం సన్నిదిలో అలివేలు మంగమ్మ దేవాలయం ప్రాంగణంలో అలివేలు మంగ తాయారు కళ్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవాలయాన్ని రంగు రంగుల విద్యుత్‌ దీపాలతో అలంకరణ చేశారు. ఉత్సవమూర్తి విగ్రహాలకు అర్చకులు ప్రత్యేక పూజలు చేసి పట్టువస్త్రాలతో అలంకరణ చేసి కళ్యాణం కోసం పందిరిలోకి తీసుకుని వచ్చారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మధుసూదన్‌ రావు అర్చకుల వేద మంత్రోచ్ఛారణతో వైభవంగా కళ్యాణం నిర్వహించారు. అలివేలు మంగతాయారమ్మ కళ్యాణం తిలకించేందుకు వివిధ గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో దేవాలయం వద్దకు తరలివచ్చారు. వచ్చిన భక్తులకు ఆలయ సిబ్బంది వారు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రజా ప్రతినిధులు కూడా కళ్యాణ కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తుల సందడితో దేవాలయం ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఈ కార్యక్రమంలో ఈఓ శ్రీనివాసరాజు , నిత్యానందచారి , ఆలయ సిబ్బంది వారు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement