Saturday, May 11, 2024

టోల్ గేట్ వద్ద పట్టుబడ్డ భారీ నగదు, బంగారం

విశాఖ జిల్లా నక్కపల్లి పోలీసులు వేంపాడు హైవే టోల్ ప్లాజా వద్ద భారీ స్థాయిలో బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సై అప్పన్న మాట్లాడుతూ.. శనివారం రాత్రి 11 గంటలకు వేంపాడు హైవే టోల్ ప్లాజా వద్ద తమ సిబ్బందితో వాహనాలను తనిఖీ చేస్తుండగా, ఓ హోండా సిటీ కారులో భారీస్థాయిలో బంగారం, నగదు ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. సుమారు 27 బంగారం బిస్కెట్లు, రూ.53.10 లక్షలకు సరైన ఆధారాలు చూపించక పోవడంతో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement