Thursday, July 25, 2024

Congress – ల‌క్ష్మ‌ణ్ వి ప‌గ‌టి క‌ల‌లు…. ఆగ‌స్ట్ సంక్షోభం క‌ల్ల – జ‌గ్గారెడ్డి

హైద‌రాబాద్ – కాంగ్రెస్ కు ఆగ‌స్ట్ లో సంక్షోభం వ‌స్తుంద‌ని బిజెపి ఎంపి కె ల‌క్ష్మ‌ణ్ చేసిన వ్యాఖ్యాల‌ను ఖండించారు టీపీసీసీ
ప్రధాన కార్యదర్శి జగ్గారెడ్డి.. ఆయ‌న‌వి ప‌గ‌టి క‌ల‌లేనంటూ ఎద్డేవా చేశారు.. గాంధీ భ‌వ‌న్ నేడు ఆయ‌న మీడియాతో మాట్లాడూతూ, రుణమాఫీ చేయకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్ట్ సంక్షోభం ఎదుర్కొంటుందని లక్ష్మణ్ పండితుడిలా జాతకాలు చెబుతున్నారని మండి ప‌డ్డారు… . బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారు అనటంలో అర్థం ఏమిటి? అని ప్రశ్నించారు. 65 సీట్లు ఉన్న కాంగ్రెస్ ఎందుకు పడిపోతుంది? అని నిలదీశారు. అసలు బీఆర్ఎస్ నుంచి 25 మంది చేరితో త‌మ ప్ర‌భుత్వం బ‌లం 90 కి దాటిపోతుంద‌ని,అప్పుడు కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఎలా కూలుతుంద‌ని ప్ర‌శ్నించారు.

తెలంగాణలో తాము అధికారంలో ఉన్నప్పటికీ, లోక్ సభ ఎన్నికల సమయంలో ఎవరికీ ఇబ్బందులు కలిగించలేదన్నారు. పోలీస్ వ్యవస్థను కూడా దుర్వినియోగం చేయలేదన్నారు. స్వేచ్ఛగా ప్రశాంతంగా ఎన్నికలు జరిపించటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విజయవంతమైందన్నారు. తమ ప్రభుత్వం ఇచ్చే పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. దేవుళ్లను అడ్డుపెట్టుకుని బీజేపీ రాజకీయం చేస్తోందని ఆరోపించారు. ఆ పార్టీ అన్నీ అబద్ధాలే చెబుతోందన్నారు. దేవుడి పేరు చెప్పుకోవడం… కన్ఫ్యూజ్ చేయడమే బీజేపీ అజెండా అని విమర్శించారు.

- Advertisement -

హామీలు ఇచ్చి ఎగనామం పెట్టడంలో బీజేపీ నాయకులని మించిన వారు లేరన్నారు. మోసం అంటే ఎలా ఉంటుందో కూడా కాంగ్రెస్ పార్టీకి తెలియదన్నారు. చెప్పిన పనిని ఇచ్చిన మాటను అమలు చేయటం మాత్రమే తమ పార్టీకి తెలుసునని వ్యాఖ్యానించారు. తమ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు మనసు మార్చుకుని రావటం వేరు.. విలీనం వేరు అన్నారు. లక్ష్మణ్‌కు పొలిటికల్ చిప్ చెడిపోయినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. కొత్త చిప్ వేసుకొని రావాలని… కావాలంటే దానికి అయ్యే ఖర్చును కూడా కాంగ్రెస్ ఇస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement