Friday, April 26, 2024

ప్రారంభానికి సిద్దంగా రైతువేదిక భవనం..

దేవరకద్ర : మండల పరిధిలోని లక్ష్మిపల్లి , గోపన్‌ పల్లి , కౌకుంట్ల , దేవరకద్ర గ్రామాల్లో నూతనంగా నిర్మించిన రైతు వేదిక భవనాలు ప్రారంభం చేయడానికి శనివారం తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ , స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి , జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ స్వర్ణ సుధాకర్‌ రెడ్డి వస్తున్నారని మండల పార్టీ అధ్యక్షుడు నర్సింహా రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి , షాదీముబారక్‌ చెక్కులను పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమాలకు వ్యవసాయ శాఖ అధికారులు , జడ్పిటిసి లు , ఎంపిపిలు ,మార్కెట్‌ చైర్మన్‌ లు , సింగిల్‌ విండో అధ్యక్షులు పాల్గొంటారని ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement