Friday, April 26, 2024

క‌రోనాతో గుంటూరు వైసిపి అధ్య‌క్షుడు పాద‌ర్తి క‌న్నుమూత‌..

గుంటూరు: క‌రోనాతో వైసీపీ గుంటూరు నగర అధ్యక్షుడు పాదర్తి రమేష్‌గాంధీ కన్నుమూశారు. ఆయన కరోనాతో కొద్ది రోజులుగా హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన నేడు కన్నుముశారు. ఇటీవల జరిగిన గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల్లో 6 వార్డు కార్పోరేటర్‌గా గాంధీ గెలిచారు. ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం ఆయ‌న కరోనా భారీన ప‌డ్డారు.. అప్ప‌టి నుంచి హాస్ప‌ట‌ల్లో చికిత్స పొందుతుండ‌టంతో కార్పోరేటర్‌గా ప్రమాణస్వీకారం కూడా చేయలేదు. ఆయ‌న మృతితో వైసీపీ నేత‌లు పలువురు సంతాపం తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement