Wednesday, May 1, 2024

Andhra Pradesh – టీడీపీకి కృష్ణుడు, వైసీపీ డొక్కా గుడ్ బై

ఎన్నిక‌ల వేళ‌ ప్ర‌చారంతో పాటు పార్టీ ఫిరాయింపులు జోరుగా సాగుతున్నాయి. వైసీపీ, టీడీపీకి చెందిన ఇద్ద‌రు కీల‌క‌నేత‌లు ఆయా పార్టీల‌కు శుక్ర‌వారం గుడ్ బై చెప్పారు. గుంటూరు జిల్లా వైసీపీ అధ్య‌క్షుడు , సీనియ‌ర్ నేత డొక్కా మాణిక్య వ‌ర‌ప్ర‌సాద్ ప‌ద‌వికి, పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేర‌కు త‌న రాజీనామా లేఖ‌ను పార్టీ అధ్య‌క్షుడు జ‌గ‌న్‌కు పంపారు.. డొక్కా టీడీపీలో చేరే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

య‌న‌మ‌ల సోద‌రుడు బైబై…

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లా తుని నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన యనమల కృష్ణుడు టీడీపీకి రాజీనామా చేశారు. ఈ మేర‌కు త‌న రాజీనామా లేఖ‌ను పార్టీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబుకు పంపారు.. ఈ సంద‌ర్భంగా తునిలో మీడియాతో మాట్లాడుతూ.. 42 ఏళ్లుగా టీడీపీ కోసం పనిచేశానన్నారు. పార్టీ మారడం బాధగా ఉన్నా తప్పలేదన్నారు. జగన్ ఆహ్వానం మేరకు వైసీపీలో చేరుతున్నట్లు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement