Thursday, May 2, 2024

KHM: బీఅర్ఎస్ నేత గణేష్ ఆస్తులపై నజర్..

ఇల్లందు…. బీఅర్ఎస్ నేత, మద్యం వ్యాపారి కొండపల్లి గణేష్ ఆస్తులపై అధికార పార్టీ నేతలు నజర్ పెట్టారు. మున్సిపల్ చైర్మన్ డీవీ పై పెట్టిన అవిశ్వాసానికి నాయకత్వం వహించిన గణేష్ అధికార పార్టీకి టార్గెట్ అయ్యాడు. ఇందులో భాగంగా వారం క్రితం గణేష్ కు చెందిన 12 ఎకరాల భూమిని అది ఫారెస్ట్ భూమి అని, అందులో వున్న షెడ్లు కూలగొట్టి ల్యాండ్ ను స్వాధీనం చేసుకున్నారు.

ఇది మర్చిపోకముందే కొత్త బస్టాండ్ ఎదురుగా వున్న గణేష్ వైన్స్ షాపులో 21సంవత్సరాల్లోపు వారికి మద్యం విక్రయిస్తున్నాడన్న ఆరోపణలతో షాపును సీజ్ చేశారు. ఈ పరిణామాలు ఇంతటితో ఆగుతాయా.. లేక ఇంకా కొనసాగుతాయా అనే విషయంలో జరుగుతున్న పరిణామాలను పట్టణ ప్రజలు గమనిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement