Tuesday, May 14, 2024

KHM: వైరాలో బీఆర్ఎస్ నేత‌లు కాంగ్రెస్ పార్టీలో చేరిక…

వైరా, మే 1(ప్రభ న్యూస్): ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలోని నియోజకవర్గ కేంద్రమైన వైరాలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయ‌కులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైరా మండలం నారపనేని పల్లి గ్రామంలో ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువాళ్ల దుర్గాప్రసాద్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో నలుగురు మాజీ సర్పంచులు, నలుగురు ఎంపీటీసీలు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, పూసలపాడు సొసైటీ చైర్మన్ చేరారు.

ఎమ్మెల్యే రాందాస్ నాయక్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ సమక్షంలో కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీలో చేరిన వారిలో సర్పంచులు శీలం సుజాత, పసుపులేటి వినోద, సాదం రామారావు, సొసైటీ శ్రీనివాసరావు, డైరెక్టర్ రత్నంరాజు, ఎంపీటీసీలు శీలం వెంకటరామిరెడ్డి, మట్టూరి కృష్ణారావు, వేల్పుల మురళి, కృష్ణ, సత్యానందం ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement