Thursday, May 16, 2024

TS : చెట్టును ఢీకొన్న స్కూటీ… ఒకరి మృతి, మరో ఒకరికి గాయాలు..

కరకగూడెం, 28 (ప్రభ న్యూస్) మండలంలోని కలవాలా నాగారం గ్రామం దాటుతుండగా మూల సమీపంలో అదుపుతప్పి పక్కనున్న చెట్టుకు ఢీకొనడంతో అక్కడికక్కడే ఒకరు మృతి చెందాడు మరొకరు మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఏ సంఘటన ఆదివారం చోటుచేసుకుంది.

మణుగూరు మండలం విజయనగరం గ్రామానికి చెందిన బిజ్జా రమేష్ , సోదరుడు కృష్ణ ఇద్దరు సొంత అన్నదమ్ములు, వారు విజయనగరం నుండి కరకగూడెం వెళ్తుండగా కలవల నాగారం సమీపంలో మూలములకు అదుపు తప్పడంతో తమ్ముడు బిజ్జా రమేష్ రమేష్ మృతి చెందాడు. అన్నయ్య బిజ్జా కృష్ణ గాయాలతో ఉండగా స్థానిక గ్రామస్తులు సమాచారం మేరకు 108 మణుగూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం మేరకు పోలీస్ డిపార్ట్మెంట్ సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement