Friday, May 3, 2024

TS : రేషన్ బియ్యం పట్టుకున్న పోలీసులు

మణుగూరు, ఏప్రిల్ 28,(ప్రభ న్యూస్): అక్రమంగా రవాణా చేస్తున్న 40 క్వింటాల రేషన్ బియ్యం ను మణుగూరు పోలీసులు ఆదివారం తెల్లవారు జామున పట్టుకున్నారు. మణుగూరు సి.ఐ సతీష్ కూమర్ తెలిపిన వివరాలు ప్రకారం….మణుగూరు శివారులోని గవర్నమెంట్ అసుపత్రి వద్ద పెట్రోలింగ్ చేస్తుండగా,గుట్ట మల్లారం గ్రామానికి చెందిన,బుర్ర చక్రపాణి అనే వ్యక్తి ,ఆశోక్ లేలాండ్ వాహనంలో ,40 క్వింటాల బియ్యం తీసుకు వెళ్తుండగా,పోలీసులను చూసి కూత వేట దూరంలో నిలిపి వేశాడు.

అనుమానం వచ్చి అ వా‌హనం దగ్గరికి వెళ్ళి తనిఖీ చేయగా, రేషన్ బియ్యం తెలవడంతో అ వ్యక్తి తో పాటు,వాహనాన్ని అదుపులోకి తీసుకుని, పోలీసు స్టేషనుకు తరలించామని వివరాలు తెలిపారు. ఈ రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులకు అప్పగించమని వివరాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement