Monday, May 20, 2024

Olympics: పారిస్ ఒలింపిక్స్…శ‌ర‌ణార్ధుల కోసం ప్ర‌త్యేక జ‌ట్టు

11దేశాల నుంచి 36 మంది అథ్లెటిక్స్ తో టీమ్
12 క్రీడ‌ల‌లో పార్టిసిపేట్

- Advertisement -

స్విట్జర్లాండ్‌: మరికొద్దిరోజుల్లో పారిస్‌ వేదికగా జరగాల్సి ఉన్న ఒలింపిక్స్‌లో శరణార్థుల (రెఫ్యూజీ) జట్టును అంతర్జాతీయ ఒలింపిక్‌ సమాఖ్య (ఐవోసీ) ప్రకటించింది. 11 దేశాలకు చెందిన 36 మంది అథ్లెట్లు.. ఐవోసీ రెఫ్యూజీ ఒలింపిక్‌ టీమ్‌ పేరిట పోటీ పడనున్నారు. వీళ్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది శరణార్థులకు ప్రాతినిథ్యం వహిస్తారని ఐవోసీ అధ్యక్షుడు థామస్‌ బాచ్‌ ఓ ప్రకటనలో తెలిపారు.


ఒలింపిక్స్‌లో శరణార్థుల జట్టు ప్రాతినిథ్యం వహించడం ఇది మూడోసారి. ఈసారి విశ్వక్రీడలలో 36 మంది శరణార్థుల జట్టు బ్యాడ్మింటన్‌, బాక్సింగ్‌, కనోయ్‌, సైక్లింగ్‌ వంటి 12 క్రీడల్లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement