Tuesday, July 23, 2024

TS : చెట్టును ఢీకొన్న కారు.. వృద్ధ దంపతులు మృతి

కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో మంటలు చెలరేగి వృద్ధ దంపతులు మృతి చెందిన ఘ‌ట‌న‌ ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో వృద్ధ దంపతులు సూర్యనారాయణ, రుక్మిణి అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి.

బోనకల్‌ మండలం ముష్టికుంట్ల సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న యువకులిద్దరినీ ఖమ్మంలోని ఆస్పత్రికి తరలించారు. మృతిచెందిన వృద్ధ దంపతులు మామిళ్లగూడేనికి చెందినవారిగా గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement