Monday, April 29, 2024

Brutal – కామారెడ్డిలో ఆట‌వికం…న‌గ్నంగా చేసి ద‌ళిత‌ మ‌హిళ‌కు చిత్ర హింస‌లు

కామారెడ్డి – సభ్య సమాజం తలదించుకునే ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. దళితురాలిని వివస్త్రను చేసి కారం చల్లి చితకబాదిన ఘటన మాచారెడ్డి మండలంలోని ఓ గ్రామంలో సంచలనం రేపింది. ఈఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం ఘటనకు సంబంధించి కొందరు ఓ దళిత మహిళను వివస్త్రగా మార్చి కారం చ‌ల్లి చిత్రహింసలు పెట్టారు. గ్రామంలో నడిబజారులో అందరు చూస్తుండగానే చెట్టు కట్టేసీ తీవ్రంగా కొట్టారు. మూడురోజులు క్రితం జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగుచూసింది.

రామారెడ్డి మండలానికి వలస వచ్చి బతుకుతున్న జంటపై మొదట దాడి చేశారు. ఇక్కడి నుంచి మాచారెడ్డి మండలంలోని మరో గ్రామానికి బాధిత జంటను తీసుకెళ్లి అక్కడ చెట్టుకట్టేసి కొట్టారు. తీవ్రగాయాలతో కొట్టుమిట్టాడుతున్న మరుసటి రోజు వారిని కొందరు ఆసుపత్రికి తరలించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో చెలరేగిన వివాదంతో ఇదంతా జరిగినట్లు స‌మాచారం. అయితే ఈ దారుణంపై పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement