Monday, May 6, 2024

AP: చంద్ర‌బాబుకు అధికార‌మిస్తే.. మరో పదేళ్లు వెనక్కి.. మంత్రి పెద్దిరెడ్డి

చంద్రబాబుకు అధికారం ఇస్తే రాష్ట్రం మళ్లీ పదేళ్లు వెనక్కి పోతుందని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి విమర్శలు కురిపించారు. టీడీపీ హయాంలో రైతులను చంద్రబాబు మోసం చేశారని ఆయన ఆరోపించారు. రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చి తప్పారని వ్యాఖ్యానించారు.

టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు రూ. 14,200 కోట్లు డ్వాక్రా రుణాలు ఉన్నాయని తెలిపారు. నేడు వాటికి వడ్డీలకు వడ్డీలు రూ.25వేల కోట్లు అయ్యింద‌న్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు నెలవేర్చాలంటే రూ.2 లక్షల కోట్లు కావాలని ఎద్దేవా చేశారు. మరోసారి ప్రజలను మోసం చేసేందుకు నెరవేర్చలేని హామీలు ఇస్తున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement