Wednesday, May 1, 2024

ట్రాక్టర్ బోల్తా.. ఒకరి మృతి 13 మందికి తీవ్ర గాయాలు

పెద్దపల్లి – ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందడంతో పాటు 13 మంది ఇటుక బట్టి కార్మికులు తీవ్రంగా గాయపడిన సంఘటన సోమవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. గౌరెడ్డి పేటలోని ఇటుక బట్టీలో పనిచేస్తున్న కార్మికులు సరుకులు కొనేందుకు ట్రాక్టర్ లో పెద్దపెళ్లి కి బయలుదేరగా మంథని ఫ్లైఓవర్ వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇటుక బట్టి కార్మికుడు ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో మహిళా కార్మికులు తీవ్రంగా గాయపడింది. గాయపడిన మహిళను కరీంనగర్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మరో 13 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారని పెద్దపెల్లి సీఐ ప్రదీప్ కుమార్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement