Tuesday, May 21, 2024

TS | కేంద్రం నుంచి బండి సంజ‌య్‌ తెచ్చిందేమీ లేదు.. రేవంత్ విమ‌ర్శ‌ల దాడి

క‌రీంన‌గ‌ర్ ఎంపీగా ఉన్న బండి సంజ‌య్ ఈ అయిదేండ్ల కాలంలో జిల్లాకు తెచ్చిందేమీ లేద‌ని సీఎం రేవంత్‌రెడ్డి మండిప‌డ్డారు. జ‌మ్మికుంట‌లో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌సంగిస్తూ బీజేపీ, బీఆర్ఎస్ తీరుపై విమ‌ర్శ‌లు చేశారు. కాగా, కరీంనగర్‌ ప్రజలపై సీఎం రేవంత్ ప్రశంసల వర్షం కురిపించారు. లోక్‌స‌భ‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం జమ్మికుంటలో జనజాతర పేరిట నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరీంనగర్ జిల్లా చైతన్యవంతమైందని.. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిందన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో కరీంనగర్ ప్రజలు కీలక భూమిక పోషించారని కొనియాడారు.

- Advertisement -

ఉద్యమ సమయంలో కరీంనగర్ ప్రజలు కేసీఆర్‌కు అండగా ఉన్నా.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆయన ఈ జిల్లాను పట్టించుకోవలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నిక‌లు సెమీ ఫైనల్ అని.. ఈ సెమీస్‌లో కేసీఆర్‌ను చిత్తుచిత్తుగా ఓడించిన‌ట్టు చెప్పారు..

ఇప్పుడు ఫైనల్స్‌లో ప్రధాని మోదీని ఓడించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని సీఎం రేవంత్ అన్నారు. కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఈ ఐదేళ్లలో కేంద్రం నుండి తెలంగాణకు తెచ్చిందేమి లేదని మండిపడ్డారు .కరీంగర్ బీజేపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement