Friday, May 17, 2024

వైసీపీ నేతల ఆగడాలను బయటపెట్టాలని అచ్చెన్న పిలుపు

వైసీపీ నేతలపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. వైసీపీకి ఓటు వేయకపోతే ప్రభుత్వ పథకాలు రావంటూ వైసీపీ నేతలు ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే వెంటనే తమకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. వైసీపీకి ఓటు వేయకపోతే పథకాలు రావంటూ భయపెట్టే వాలంటీర్ల ఆగడాలను బయటపెట్టాలన్నారు. అలాంటి వారి గురించి 7557557744 నంబర్‌కు వాట్సాప్ చేయాలని కోరారు. ఈ నంబర్‌కు కాల్ రికార్డు కానీ, ఫొటో కానీ వాట్సాప్ చేసిన వారి అకౌంట్‌లోకి రూ. 10 వేలు వేస్తామన్నారు.

తిరుపతి లోక్ సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు ఇది వర్తిస్తుందన్నారు. పథకాలు పోతాయని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని.. అవి జగన్ రెడ్డి తండ్రి డబ్బులో, తాత డబ్బులో కాదని… అవి ప్రజల డబ్బులని అన్నారు. 10 పైసలు ఇచ్చి 90 పైసలు దోచుకుంటున్న జగన్‌కు బుద్ధి చెప్పాలంటే… తిరుపతి ఉప ఎన్నికలో ఓటర్లంతా టీడీపీ పక్షాన నిలవాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement