Tuesday, May 21, 2024

TS: అభివృద్ధిలో శ్రామికులే అసలైన భాగస్వాములు: సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాదాద్ : అభివృద్ధిలో శ్రామికులే అసలైన భాగస్వాములని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణానికి అలుపెరగకుండా శ్రమిస్తున్న కార్మికులందరికీ ‘మే డే’ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా పాలనలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవ స్ఫూర్తి అన్ని రంగాలకు విస్తరిస్తోందని, కార్మికులకు సముచిత గౌరవం లభిస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే నూతన పారిశ్రామిక విధానం వారి అభ్యున్నతికి తప్పకుండా దోహదపడుతుందని చెప్పారు. కార్మికుల శ్రేయస్సు, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నట్లు రేవంత్‌రెడ్డి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement