Wednesday, May 8, 2024

ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయొద్దు..

మెట్‌పల్లి: కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావుపై కాంగ్రెస్‌ నాయకులు చేస్తున్న తప్పుడు ఆరోపణలు మానుకోవాలని తెరాస పట్టణ ప్రధాన కార్యదర్శి మార్గం గంగాధర్‌ పేర్కొన్నారు. పట్టణంలో విలేకరులతో మాట్లాడుతూ కల్యాణ లక్ష్మీ, షాధి ముబారక్‌ చెక్కుల పంపిణి జాప్యం జరుగుతోందని కాంగ్రెస్‌ పార్టీ ప్రచారం చేయడం విడ్డురంగా ఉందన్నారు. ఎమ్మెల్యే ప్రజల సమస్యలను ఎప్పటి కప్పుడు తెలుసుకుంటూ వెంటనే పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యలపై స్పందించడం వల్లే నాలుగుసార్లు వారిచే ఎన్నుకోబడ్డారని హితవు పలికారు. అనారోగ్య రీత్యా ఎమ్మెల్యే అందుబాటులో లేరే తప్ప వేరే కారణం లేదన్నారు. అలాగే కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌ చెక్కుల పంపిణీ జరుగుతున్న విషయం కనిపించక పోవడం సిగ్గు చేటని, ఇప్పటికైనా కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు కుతుబుద్దీన్‌ నోరు అదుపులో పెట్టుకోవాలని, లేకుంటే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement