Friday, April 19, 2024

బీజేపీ నేతలు నన్ను చంపేస్తామంటున్నారు: హీరో సిద్ధార్థ్

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కరోనా వ్యాప్తిని అరికట్టడంలో విఫలమైందని, ఈ విషయంలో ఇప్పటికి కూడా సరైన నిర్ణయం తీసుకోలేకపోతోందని హీరో సిద్ధార్థ్ సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ప్రజలకు కనీస వైద్యసదుపాయాలు అందుబాటులో ఉంచని ఇలాంటి ప్రభుత్వం ఉంటే ఏంటి? లేకుంటే ఏంటి? అంటూ విమర్శలు చేశాడు. ముందుచూపులేని మోదీ పాలన వల్ల దేశం మొత్తం కరోనాతో బాధపడుతోందని, ఇక రిజైన్ చేసి టీస్టాల్ పెట్టుకోవడమే మంచిదని సూచించాడు.

దీంతో తమిళనాడు బీజేపీ నాయకులు హీరో సిద్ధార్థ్‌ను టార్గెట్ చేశారు. ఈ మేరకు తన సెల్ నెంబర్ లీక్ చేశారని, తను మళ్లీ నోరు తెరవకుండా టార్చర్ చేయాలని పలువురికి ఫోన్ నంబర్ ఇచ్చారని సిద్ధార్థ్ ఆరోపించాడు. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా షేర్ చేశాడు. తనకు దాదాపు 500 ఫోన్ కాల్స్ వచ్చాయని, తనను తన ఫ్యామిలీని చంపేస్తామని బెదిరిస్తూ దారుణంగా తిట్టారని తెలిపాడు. ఈ కాల్స్ అన్నీ కూడా రికార్డ్ చేసి పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసినట్లు వెల్లడించాడు. కాగా ఎన్ని ప్రయత్నాలు చేసినా తన నోరు మూయించలేరన్న సిద్ధార్థ్.. బీజేపీ నేతలు వాళ్ల ప్రయత్నాలు వారు చేసుకోవచ్చంటూ మోదీ, అమిత్ షాలను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు.

https://twitter.com/Actor_Siddharth/status/1387653507814072325
Advertisement

తాజా వార్తలు

Advertisement