Wednesday, May 8, 2024

కరోనా విజృంభన..జాగ్రత్తలు..

ఇల్లంతకుంట: కరోనా కేసులు రోజు రోజుకి రెండోసారి విజృంభిస్తుందని, జాగ్రత్తలు మరింతగా పాటించాలని ఎస్సై పంజాల మల్లేశం గౌడ్‌ అన్నారు. మండల కేంద్రంలోని బస్టాండ్‌ అవవరణలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్‌ హెగ్డే ఆదేశాల మేరకు కరోనాపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ప్రతివ్యక్తి బయటకు వెళ్ళేటప్పుడు మాస్కును ధరించాలని, సామాజిక దూరాన్ని పాటించాలన్నారు. సభలు, సమావేశాలు, ర్యాలీలు, ప్రజలతో చేపట్టే ఏ కార్యక్రమాలు నిర్వహించవద్దన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టు-కొని ప్రభుత్వం పలు నిషేధాజ్ఞలు జారీ చేసినట్లు- వివరించారు. ఉల్లంఘించిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ప్రతిఘ్య చేయించారు. ఈ సమావేశంలో పోలీసు సిబ్బంది, గ్రామస్తులు, ప్రయాణికులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement