Monday, May 6, 2024

కార్మిక కోడ్‌ల ప్రతులు దహనం..

యైటింక్లయిన్‌కాలనీ: కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆర్జీ2 ఏరియా పరిధిలోని అన్ని మైన్స్‌, డిపార్టుమెంట్‌లలో 4 కోడ్‌ల ప్రతులను ఏఐటీయూసీ ఆధ్వర్యంలో దహనం చేశారు. కార్మిక కోడ్‌లను తెచ్చి కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను హరిస్తుందని మండిపడ్డారు. వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈకార్యక్రమంలో కేంద్ర ఉపాధ్యక్షుడు ఎల్‌. ప్రకాశ్‌, బ్రాంచి కార్యదర్శి రాజరత్నం, నాయకులు అన్నారావు, శ్యామ్సన్‌, బుర్ర తిరుపతి, సాంబశివరావు, కిరణ్‌కుమార్‌, నరేశ్‌, బ షీర్‌, శంకర్‌, సంపత్‌, కనకయ్య, రాజు, కనకయ్య, నారాయణ, రాజసాగర్‌, మల్లేశ్‌, నర్సింహరావు, విష్ణు మనోహర్‌, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement