Friday, April 26, 2024

అరెస్టులతో కొండగట్టు మరకలను చెరపలేరు : బీజేపీ నేత కొట్టె మురళీకృష్ణ

కొండగట్టు ప్రమాదం జరిగి సంవత్సరాలు గడుస్తున్న చలించని ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రాయశ్చిత్తం చేసుకునే అర్హత లేదని, కొండగట్టు బస్సు ప్రమాద మరకలను ప్రజలు ఇంకా మరువలేదని బిజెపి మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొట్టె మురళీకృష్ణ
అన్నారు. బీజేపీ నాయకత్వంలో ఆంజనేయ స్వామి భక్తులు ప్రజలు నిలదీస్తారనే భయంతోనే ఒకరోజు ముందుగా బీజేపీ కార్యకర్తలను, హిందూ నాయకులను అరెస్టులు చేస్తున్నార‌ని ఆరోపించారు. కొండగట్టు ప్రమాదం జరిగి సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటివరకు చలించని కేసీఆర్ కు కొండగట్టులో పర్యటించే అర్హత లేదని ఆయన విమర్శించారు. కొండగట్టులో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంజనేయ స్వామి భక్తులకు, ప్రజలకు, బాధిత కుటుంబాలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అరెస్టు చేసిన బీజేపీ నాయకులను, హిందూ సంస్థల కార్యకర్తలను బేసరత్తుగా విడుదల చేయాలని, లేని పక్షంలో పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయని ప్రజల సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులను ప్రజా ప్రతినిధులను నిలదీస్తామని మురళీకృష్ణ హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement