Tuesday, May 14, 2024

విద్యుత్ తీగలు పడి ఆవు, దూడ మృతి

అకాల వర్షానికి కరీంనగర్ లోని 18వ డివిజన్ రేకుర్తిలోని సర్వేనెంబర్ 108 లోని బండారి అశోక్ వ్యవసాయ భూమిలో ఈదురు గాలులకు రాత్రి 11గంటలకు చెట్ల కొమ్మలు కరెంటు తీగలపై వాలి 11kv కరెంటు తీగ తెగి పడడంతో అక్కడే ఉన్న ఒక ఆవు ఒక దూడ విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాయి. రేకుర్తి ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వెంటనే 1
8వ డివిజన్ కార్పొరేటర్ సూదగోని మాధవి కృష్ణ గౌడ్ లైన్ మెన్ ను తీసుకువచ్చి విద్యుత్ లైన్ ఆఫ్ చేసి అక్కడే ఉన్నా ఇంకొక మూడు ఆవులను రక్షించడం జరిగింది. ఈ విషయాన్ని మంత్రి గంగుల కమలాకర్, నగర మేయర్ యాదగిరి సునీల్ రావుకు మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లగా.. స్పందించి వెంటనే రైతులకు ప్రభుత్వం తరఫున తక్షణ సహాయం అందిస్తామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement