Tuesday, July 23, 2024

AP | ముఖ్యమంత్రి జగన్ ప్రమాణ స్వీకారం విశాఖలోనే : మంత్రి బొత్స

రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మళ్లీ ప్రమాణస్వీకారం చేస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ జోస్యం చెప్పారు. జూన్ 4 తర్వాత సీఎంగా విశాఖలోనే జగన్ ప్రమాణస్వీకారం చేస్తారని స్పష్టం చేశారు. ఏపీ ఎన్నికలపై మంత్రి బొత్స మంగళవారం నాడు మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో సీఎం జగన్ ను మరోసారి ఆశీర్వదించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. జగన్ చెప్పినవన్నీ చేసి చూపించారని… అన్ని ప్రాంతాల వారికి సంక్షేమ పథకాలు అందించామని తెలిపారు. రాజకీయాల్లో నిజాయితీ ముఖ్యమని… అవినీతిని రూపుమాపేందుకే సచివాలయాలను ప్రవేశపెట్టామన్నారు.

తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు తెలిసింది మోసం, దగా, కుట్రలు అని, మరోవైపు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ చెప్పింది చేస్తారని పేర్కొన్నారు. టీడీపీ కూటమి ఎన్ని హామీలు ఇచ్చినా ఏపీ ప్రజలు వారిని నమ్మలేదని, అందుకే మే 13న జరిగిన ఏపీ ఎన్నికల్లో రాష్ట్రమంతా వైసీపీ గాలి బలంగా వీచిందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఇక కేంద్రంలో ఎవరు వచ్చినా, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సిద్ధమని మంత్రి బొత్స స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాలు తప్పా, రాజకీయ ప్రయోజనాలు తమకు ముఖ్యం కాదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement