Tuesday, July 23, 2024

AP |ఘోర రోడ్డు ప్రమాదం.. న‌లుగురు కూలీలు దుర్మరణం

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పి.గన్నవరం మండలం ఊడిమూడి వద్ద ట్రాక్టర్‌, ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌లోని నలుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

ట్రాక్టర్‌లో ధాన్యం లోడ్‌ చేస్తున్న కూలీలను రాజోలు నుంచి రాజమండ్రి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఆర్టీసీ బస్సులోని ప్రయాణీకులు కూడా స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఐదుగురు కూలీల మృతితో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల్లో ముగ్గురు జి.పెద్దపూడి, మరొకరు ఆదిమూలవారిపాలెం వాసిగా తెలిసింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement