Sunday, May 26, 2024

భారత్‌ కా అమృత్‌ మహోత్సవ్

గోదావరిఖని: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75వ వసంతంలోకి చేరవవుతున్న సందర్భంగా ఆర్జీ1 ఏరియా పరిధిలోని జీడీకే 1, 3ఇంక్లయిన్‌లలో భారత్‌ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలరీ మేనేజర్‌ డి. రమేశ్‌బాబు జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఉద్యోగులు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ఈకార్యక్రమంలో అధికారులు శ్రీనివాసరావు, టీబీజీకేఎస్‌ పిట్‌ కార్యదర్శి అల్లం ఐలయ్య, సాబీర్‌ అహ్మద్‌, హన్మంతరావు, శ్రీనివాస్‌రెడ్డితోపాటు ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement