Sunday, May 5, 2024

తండ్రి కొడుకుల దారుణ హత్య.. ఆస్తి త‌గాదాలే కార‌ణం?

ఉప్ప‌ల్ లో తండ్రి కొడుకులు దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. గుర్తు తెలియని దుండగులు తండ్రి నర్సింహశర్మ, కొడుకు శ్రీనివాస్‌లను కత్తులతో కడుపులో పొడిచి హతమార్చారు. దండగులు తండ్రిపై దాడికి పాల్ప‌డుతున్న స‌మ‌యంలో కొడుకు అడ్డుకునే ప్ర‌య‌త్నం చేయ‌గా ఇద్ద‌రిపై దాడికి దిగారు. శ్రీనివాస్‌పైనా కూడా కత్తులతో దాడి చేయడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ హత్యను తమ బంధువులే చేశారంటూ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు. ఆస్తి తగాదాల వల్లే దాడి చేసి చంపేశారని.. కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement