Friday, April 26, 2024

వెంక‌ట్ ప్ర‌భు డైరెక్ట్ చేస్తోన్న తొలి తెలుగు చిత్రం-కీల‌క పాత్ర‌లో ప్రియ‌మ‌ణి

హీరో నాగ‌చైత‌న్య‌..హీరోయిన్ కృతిశెట్టి మ‌రోసారి జంట‌గా ఓ చిత్రం తెర‌కెక్క‌నుంది. ఈ మూవీని త‌మిళ డైరెక్ట‌ర్ వెంక‌ట్ ప్ర‌భు తెర‌కెక్కిస్తున్నాడు. ఇందులో చైతు పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నున్నారు. ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. . తాజాగా ఈ సినిమాకు సంబంధించి చిత్రయూనిట్ మ‌రో అప్‌డేట్ ఇచ్చేసింది. నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ న‌టి ప్రియ‌మ‌ణి ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంది.రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్‌ను క‌ర్ణాట‌క‌లో చిత్రీక‌రిస్తున్న‌ప్పుడు అక్క‌డున్న గుడి ప‌క్క‌న బార్ సెట్ వేశారు. దీనిపై అక్క‌డున్న గ్రామ‌స్థులు అభ్యంత‌రం చెప్ప‌ట‌మే కాకుండా యూనిట్‌పై దాడి కూడా చేసిన‌ట్లు వార్త‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. కానీ దీనిపై చిత్ర యూనిట్ ఏమీ స్పందించ‌లేదు. అలాగే మ‌రో క్రేజీ న్యూస్ కూడా ఈ సినిమాకు సంబంధించి వైర‌ల్ అవుతోంది. అదేంటంటే, కోలీవుడ్ హీరో జీవా ఈ చిత్రంలో ప్ర‌తి నాయకుడిగా క‌నిపించ‌బోతున్నార‌ట‌. మ‌రి ఈ వార్తలపై చిత్ర యూనిట్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మ‌రి. ఈ చిత్రానికి మాస్ట్రో ఇళ‌య‌రాజా , ఆయ‌న త‌న‌యుడు యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. వీరిద్ద‌రి కాంబోలో రానున్న తొలి చిత్ర‌మిది. క‌తీర్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. వెంక‌ట్ ప్ర‌భు డైరెక్ట్ చేస్తోన్న తొలి తెలుగు సినిమా ఇదే.

Advertisement

తాజా వార్తలు

Advertisement