Sunday, May 5, 2024

హత్యా.. ఆత్మహత్యా? : బాలిక అనుమానాస్పద మృతి

నగరంలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపనపల్లి ఎన్టీఆర్ నగర్‌లో ఓ బాలిక తల్లిదండ్రులతో పాటు నివాసముంటోంది. ఇంట్లో పని విషయంలో బాలిక‌ను తల్లి మందలించింది. ఈ క్రమంలో నిన్న ఉదయం నుంచి బాలిక కనిపించకుండా పోయింది. దీంతో తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతూ బాలిక కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా… ఈరోజు ఉదయం సమీపంలోని కుంటలో బాలిక‌ శవమై తేలింది. కాగా గచ్చిబౌలి పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, హ‌త్య‌,ఆత్మహ‌త్య? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఈ కుటుంబం నాలుగు నెలల క్రితమే మహబూబ్‌నగర్ జిల్లా నాగర్ కర్నూల్ నుంచి హైదరాబాద్‌కు వలస వచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement