Friday, April 26, 2024

ఏపీ బీజేపీ పోరుబాట యాత్ర ప్రారంభం

ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టేందుకు బీజేపీ నేటి నుంచి పోరుబాట కార్యక్రమాన్ని ప్రారంభించింది.బీజేపీ పోరు బాట యాత్రను ఏపీ బీజేపీ శాఖ చీఫ్‌ సోము వీర్రాజు ప్రారంభించారు. విజయవాడలోని సత్యనారాయణపురం శివాజీ కెఫె సెంటర్లో స్ట్రీట్‌ మీటింగ్‌తో యాత్ర మొదలైంది. ఇందు కోసం ప్రత్యేకంగా ఒక బస్సు, ప్రచార రథాన్ని సిద్ధం చేసుకున్నారు.

నేటి నుంచి ప్రారంభమైన పోరుబాట యాత్ర తొలి దశ అక్టోబర్‌ 2 గాంధీ జయంతి వరకు జరుగనున్నది. దాదాపు 15 రోజులపాటు బీజేపీ ముఖ్యనాయకులంతా ప్రజల్లో ఉండేలా ప్లాన్‌ చేసుకున్నారు. 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని దాదాపు 5 వేల బహిరంగసభలు నిర్వహించేందుకు బీజేపీ సన్నద్ధమవుతున్నది. ఏపీ రాజకీయాల్లో వైసీపీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు కావాల్సిన కార్యాచరణను సిద్ధం చేసుకుని ముందుకెళ్తున్నది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి ప్రజల్లోకి తీసుకెళ్లడమే తమ యాత్ర లక్ష్యమని బీజేపీ నేతలు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement