Saturday, April 27, 2024

హిమాయత్ సాగర్ వరద నీటిని పరిశీలించిన ఎంపీ రంజిత్ రెడ్డి

గ‌త వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతం నుండి హిమాయత్ సాగర్ కు వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో జలమండలి అధికారులు వరద గేట్లను ఎత్తి దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్నారు. శుక్రవారం ఉదయం హిమాయత్ సాగర్ గుండా వెళ్తున్న చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ రంజిత్ రెడ్డి హిమాయత్ సాగర్ చెరువు కట్ట వద్ద ఆగి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా ఫోన్ లో జలమండలి అధికారులను ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో, తదితర వివరాలను అడిగి తెలుసుకుని.. అక్కడే వున్న సందర్శకులతో కాసేపు మాట్లాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement