Friday, April 26, 2024

ఫేక్ కాల్ – కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ లో బాంబు

హైదరాబాద్‌: తిరుపతి నుంచి ఆదిలాబాద్‌కు వెళ్లే కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ రైలులో బాంబు ఉందంటూ వచ్చిన ఫోన్‌ కాల్‌తో సికింద్రాబాద్‌ ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది ఉరుకులు పరుగులు పెట్టారు. మౌలాలి రైల్వే స్టేషన్‌లో రైలును ఆపి ఇంజిన్‌ వెనక ఉన్న జనరల్‌ బోగిల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. చివరకు ఎలాంటి బాంబు లేదని తనిఖీల అనంతరం పోలీసులు నిర్ధరించడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. మౌలాలి స్టేషన్‌ నుంచి రైలు బయలుదేరింది. బాంబు ఉందంటూ ఫోన్‌ చేసిన ఆగంతకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement