Friday, April 19, 2024

ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట? కొవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో ప్రాధాన్యత.. కేంద్ర బడ్జెట్‌పై నిపుణుల అంచనాలు

కేంద్ర బడ్జెట్‌లో ప్రాధాన్య రంగాల జాబితాలో ఆరోగ్య సంరక్షణ, తయారీ రంగాలు ముందు వరుసలో ఉన్నాయి. కొవిడ్‌ మహమ్మారి పరిణామాలు ఆరోగ్యరంగ విస్తరణ, అభివృద్ధి అవసరాలను నొక్కిచెప్పాయి. అదే సమయంలో మహమ్మారి పరిస్థితుల అంతరాయాల నుండి తయారీరంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈనేపథ్యంలో తయారీ పరిశ్రమ కార్యకలాపాలను పునరుజ్జీవింపజేసేందుకు బడ్జెట్‌ 2023 దృష్టిసారించినట్లు తెలుస్తోంది. హెల్త్‌కేర్‌ రంగం పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టడానికి మౌలిక సదుపాయాలపై ఎక్కువ ఖర్చు చేయాలని కూడా ఆశిస్తోంది. అత్యాధునిక ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను తయారు చేయడానికి లేదా దిగుమతి చేసుకోవడానికి బడ్జెట్‌లో అనుమతి ఇవ్వొచ్చని రూబీ హాల్‌ క్లినిక్‌ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ జ్యోతి ప్రకాష్‌ మహాపాత్ర అభిప్రాయపడ్డారు.

కోవిడ్‌-19 పెళుసుగా ఉన్న దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను కుదిపేసిన తర్వాత, ఔషధ పెట్టుబడులను విస్తరించడంలో కొత్త ఆసక్తి ఏర్పడింది. టీకాలు, ఔషధాల కోసం గత రెండేళ్లలో ప్రాముఖ్యతను సంతరించుకున్న పరిశ్రమ మెరుగైన నిధులు, నిర్దిష్ట విధానాలు, మందులపై పన్ను మినహాయింపుల కోసం ఎదురుచూస్తోందని బీడీఆర్‌ గ్రూప్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ డైరెక్టర్‌ ర#హల్‌ షా అభిప్రాయపడ్డారు. కోవిడ్‌తో పాటు ఆరోగ్య అత్యవసర పరిస్థితులకు వినూత్న పరిష్కారాలను అందించడంలో బడ్జెట్‌ 2023 ముఖ్యమైనది కాబట్టి పబ్లిక్‌ హెల్త్‌కేర్‌పై ఖర్చు చేయడం తక్షణమే పరిశీలించాలని నిపుణులు తెలిపారు.

సబ్సిడీలు.. ప్రోత్సాహకాలు..

- Advertisement -

2023-24లో భారతదేశం ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటుందని అంచనా వేయడంతో, తయారీ పరిశ్రమ నిపుణులు బడ్జెట్‌ గురించి తమ అంచనాలను పంచుకునేరు. రాబోయే బడ్జెట్‌లో మిశ్రమంతో పాటు ‘పెట్టుబడి భత్యం’ను ప్రవేశపెట్టాలని ది ఫ్రాగ్రెన్స్‌ పీపుల్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ దీపక్‌ జైన్‌ అన్నారు. యంత్ర పరికరాల పరిశ్రమను వేగవంతం చేయడానికి సబ్సిడీలు, పథకాలు ఉండాలని సూచించారు. మెటల్‌ స్క్రాప్‌పై ప్రాథమిక కస్టమ్స్‌ డ్యూటీని తొలగించాలని దేశీయ రీసైక్లింగ్‌ పరిశ్రమ అపెక్స్‌ బాడీ ప్రెసిడెంట్‌, సంజయ్‌ మెహతా కోరుతున్నారు. స్థానిక తయారీదారులను ప్రోత్సహించాలి. స్థిరమైన, వినూత్న పద్ధతులను అనుసరించే కంపెనీలకు ప్రభుత్వం రివార్డ్‌ ఇవ్వాలని వుడెన్‌స్ట్రీట్‌ సీఈవో లోకేంద్ర సింగ్‌ రణావత్‌ సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement