Sunday, May 5, 2024

ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి..

కవాడిగూడ : కరోనా వైరస్ ని ‌ అరికట్టేందుకు ప్రతి ఒక్కరు చాలా అప్రమత్తంగా ఉండాలని గాంధీనగర్‌ మున్సిపల్‌ డివిజన్‌ కార్పొరేటర్ పావని వినయ్‌కుమార్‌ సూచించారు. కరోనా నివారణ అమలుకు ప్రతి ఒక్కరు సహాకరించి, దయచేసి ఇంటికే పరిమితం కావాలని ఆమె కోరారు. డివిజన్‌లోని వివిధ బస్తీలలో శానిటైజర్‌ చేసి ప్రజల్లో అవగాహాన కల్పించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కరోనా వైరస్ ని‌ అరికట్టేందుకు ప్రతి ఒక్కరు పరిశుభ్రత, స్వీయ నియంత్రణ, సామాజిక దూరం తప్పని సరిగా పాటించాలని ఆమె పిలుపునిచ్చారు. కరోనా వైరస్‌ నివారణకు అందరూ ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజల క్షేమం కోసం అందరూ పోలీసుల ఆదేశాలు, సూచనలు తప్పనిసరిగా పాటించాలని ఆమె అన్నారు. కరోనాని అరికట్టెవరకు అందరూ ఇండ్లకే పరిమితమై కరోనా వైరస్‌ నివారణకు సహాకరించాలని కోరారు. ఈ కార్యక్రమం లో బిజెపి నేతలు వినయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement