Saturday, May 18, 2024

Rajasthan : రోడ్డు ప్ర‌మాదంలో.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి

ఓ గుర్తు తెలియని వాహనం కారును ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం పాలైన ఘ‌ట‌న రాజ‌స్థాన్ లో చోటుచేసుకుంది. రాజస్థాన్‌ సవాయ్ మాధోపుర్​లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు.

వీరందరూ వినాయక ఆలయ దర్శనానికి వెళ్తుండగా ప్ర‌మాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. మృతులందరూ కారులో సవాయి మాధోపుర్​లోని గణేశ్ ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement