Saturday, May 18, 2024

ప్రభుత్వం అండగా నిలుస్తుంది..ఎమ్మెల్యే

కవాడిగూడ : తెలంగాణలో నివసిస్తున్న ప్రతి నిరుపేద కుటుంబానికి టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అండగా నిలుస్తుందని ముషీరాబాద్‌ నియోజకవర్గం శాసనసభ్యులు ముఠా గోపాల్‌ అన్నారు. కరోనా వైరస్‌ నివారణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు జరుపుతున్న ఆదేశాలు పాటించాలని ఆయన కోరారు. కరోనా నివారణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని ఆయన వెల్లడించారు. భోలక్‌పూర్‌లోని వివిధ బస్తీలలో శానిటైజర్‌ చేయించి ప్రజల్లో కరోనా పట్ల అవగాహాన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్‌ ఉచితంగా వేస్తున్నారని.. ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆదేశాల మేరకు అందరికి ఉచితంగా వైద్యసేవలు అందజేస్తున్నామన్నారు. వివిధ బస్తీలలో నివసిస్తున్న వారికి ఏలాంటి ఇబ్బంది కలగకుండా సాహాసోపేతమైన నిర్ణయం తీసుకుని ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తుందని ఆయన చెప్పారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేని విధంగా తెలంగాణలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ కరోనా నివారణకు చర్యలు తీసుకుంటున్నాట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్‌ నేతలు ముఠా జయసింహ్మా, మహ్మాద్‌అలీ, ముచ్చకుర్తి ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement