Friday, April 26, 2024

ఉగ్రవాదులకు అడ్డాగా మారిన హైదరాబాద్.. ఓల్డ్ సిటీ బాంబుల ఫ్యాక్టరీ: రాజాసింగ్

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందన్నారు. దేశంలో ఎక్కడ పేలుళ్లు జరిగినా హైదరాబాద్ లోనే మూలాలు బయట పడుతున్నాయన్నారు. ఎంఐఎం, టీఆర్ఎస్ ఒక్కటైన తర్వాత పాతబస్తీ బాంబుల ఫ్యాక్టరీగా మారిందని ఆరోపించారు. సికింద్రాబాద్ నుంచి బీహార్ వెళ్లిన పార్సిల్ బ్లాస్ట్ ఘటనపై విచారణ జరిపారని పేర్కొన్నారు. అసిఫ్ నగర్ కి చెందిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. అందులో ఒకరు పాకిస్థాన్ లో శిక్షణ పొంది వచ్చినట్లు తేలిందన్నారు. తెలంగాణ ఇంటలిజెన్స్ విభాగం ఏం చేస్తోందని రాజా సింగ్ ప్రశ్నించారు. పాకిస్థాన్ ఎంత మంది వెళ్తున్నారన్నారు. ఇలాంటి వారు ఎంత మంది హైదరాబాద్ లో ఉన్నారు ? అంటూ ప్రశ్నించారు. పాకిస్తాన్ నుంచి వచ్చే వారిపై నిఘా ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ ఇంటిలిజెన్స్ ఘోరంగా వైఫల్యం చెందిందని విమర్శించారు. హోం మంత్రి, పోలీసులు ఎం చేస్తున్నారు ? హైదరాబాద్ లో బాంబులు తయారు చేసే పరిశ్రమలు ఎన్ని ఉన్నాయో పోలీసులు బయట పెట్టాలని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి:ప్రధాని మోదీతో మాట్లాడనున్న వరంగల్ వాసి!

Advertisement

తాజా వార్తలు

Advertisement